యాప్నగరం

Himanta Biswa Sarma: గాంధీ కుటుంబానికి కాలం చెల్లింది.. రాహుల్ అనర్హుడు: అసోం సీఎం

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. గాంధీల ఫ్యామిలీకి కాలం చెల్లిన మందులు లాంటి వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్షానికి కూడా పనికిరాదని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీకి అసలు సీరియస్‌నెసే లేదని, ఆయన రాజకీయాలకు అనర్హుడని అన్నారు. 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 30 Sep 2022, 8:24 pm

ప్రధానాంశాలు:

  • కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ
  • రాహుల్ గాంధీకి సీరియస్‌నెస్ లేదని విమర్శలు
  • 2024లో బీజేపీ మళ్లీ గెలుస్తుందన్న శర్మ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Himanta Biswa Sarma
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ..(Himanta Biswa Sarma) కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గాంధీ కుటుంబంపై ఘాటైన విమర్శలు చేశారు. వారు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేరన్నారు. గాంధీలు ఎక్స్‌పైర్ అయిపోయిన మందులులాంటి వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశంలో అధికార పార్టీ అని భావిస్తోందని, బీజేపీ ఎప్పడో అధికారాన్ని చేజిక్కించుకుందని ఆయన అన్నారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విమర్శలు చేశారు.
నిజానికి గాంధీ కుటుంబాన్ని అసలు ప్రతిపక్షంగా చూడకూడదని, కాలం చెల్లిన మందులని అన్నారు. కాంగ్రెస్ నేతలు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా నిర్వర్తించలేరు.. తామే అధికార పార్టీ అని వారి మనస్సులో ఉందని ఆయన అన్నారు. "నరేంద్ర మోదీ బలవంతంగా ప్రధాని పీఠంపై ఉన్నారని, ఆ సీటు తమకే చెందుతుందని వారు ఎక్కడో భావిస్తున్నారు. వారు విపరీతమైన కోపంతో ఉన్నారు." అని హిమాంత బిశ్వా అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాహుల్ గాంధీ రాజకీయాలకు అనర్హుడని అన్నారు. ఆయనకసలు సీరియస్‌నెసే లేదని హిమంతా బిశ్వ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వాలను బర్తరఫ్ చేసేందుకు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని హిమంతా బిశ్వా ఆరోపించారు. "నరేంద్ర మోదీ ఆ ఏకపార్టీ వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తి.. కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ఆయన సవాల్‌ చేస్తున్నారు. వారు దేశంలో ఒక కుటుంబ పాలన సృష్టించారు." అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ మరింత మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.