యాప్నగరం

అస్సాం ఫేక్ ఎన్‌కౌంటర్: ఏడుగురు జవాన్లకు జీవిత ఖైదు!

1994లో అస్సాంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉద్యమకారులు చనిపోయారు. అయితే, ఇవి బూటకపు ఎన్‌కౌంటర్లని ఫిర్యాదులు రావడంతో గత కొన్నేళ్లుగా విచారణ సాగుతోంది.

Samayam Telugu 14 Oct 2018, 11:05 pm
స్సాం బూటకపు ఎన్‌కౌంటర్‌లో జనరల్ కోర్ట్ మార్షియల్ సంచలన తీర్పు వెల్లడించింది. 1994లో అస్సాంలో ఐదుగురు ఉద్యమకారులను ఎన్‌కౌంటర్ చేసిన కేసులో నిందితులైన మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్‌లు, నలుగురు జవాన్లకు జీవిత ఖైదు విధించింది. ఈ విచారణ అస్సాంలోని డిబ్రుగడ్ జిల్లాలోని దినజన్‌లో జరిగింది.
Samayam Telugu Untitledaaa12


అయితే, ఈ సమాచారాన్ని ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ (కోల్‌కతా), న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ధృవీకరించాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్‌లు థామస్ మాథ్యూ, ఆర్.ఎస్.సిబిరెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (జేసీవో), నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు (ఎన్‌సీవో) దిలీప్ సింగ్, జగదేవ్ సింగ్, అల్బిందర్ సింగ్, శివెందర్ సింగ్‌లను దోషులుగా తేల్చినట్లు తెలిసింది. అయితే, ఆర్మీ కోర్టు వెల్లడించిన ఈ తీర్పును ఆర్మ్‌డ్ ఫోర్స్ ట్రిబ్యూనల్, సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.