యాప్నగరం

అసోంలో వరద బీభత్సం.. 3 లక్షల మందిపై ప్రభావం, ప్రమాదకరంగా బ్రహ్మపుత్ర

Assam: అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే 11 జిల్లాలను వరద నీటితో ముంచెత్తింది. 3 లక్షల మందిపై ప్రభావం పడింది. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.

Samayam Telugu 28 May 2020, 12:58 am
సోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా గోల్పారా జిల్లాలోని రంగ్జూలీలో ఓ వ్యక్తి మరణించినట్లు అసోం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 11 జిల్లాలపై వరదల ప్రభావం పడింది. వందలాది గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 321 గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నట్లు అసోం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం (మే 27) తెలిపింది. 2678 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. 3 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు తెలిపింది.
Samayam Telugu నమూనా చిత్రం
Assam Floods


వరద బాధితుల కోసం అసోం ప్రభుత్వం 55కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జోర్హాట్ పరిధిలోని నిమాతిఘాట్ వద్ద బ్రహ్మాపుత్రా నది అత్యంత ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరదలతో పాటు కొండచరియలు విరిగి పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురవడం వల్ల వందలాది నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో 30 ఇళ్లు ధ్వంసమైనట్లు అసోం వెల్లడించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Also Read: నేపాల్ ప్రధానికి బిగ్ షాక్.. కొత్త మ్యాప్‌కు బ్రేక్, భారత్ ప్రమేయం లేకుండానే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.