యాప్నగరం

టెంపో వాహనం, ట్రావెల్ బస్సు ఢీ.. 10 మంది దుర్మరణం

Assam రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెలర్ బస్సు టెంపో ట్రావెలర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 23 Sep 2019, 5:06 pm
ట్రావెలర్ బస్సు టెంపో వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. అసోంలోని శివసాగర్ జిల్లా దెమోలో సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.
Samayam Telugu assam accident


కొంత మంది పర్యాటకులతో దిబ్రూగర్ వెళ్తున్న టెంపో ట్రావెలర్.. ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 37పై ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

Don't Miss: మెట్రో రైల్లో హంగామా చేసిన మందుబాబును టెక్నాలజీ పట్టించిందిలా..

ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం నుజ్జునుజ్జయింది. రహదారి రక్తసిక్తంగా మారింది. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను అధికారులు గంటల తరబడి శ్రమించి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ప్రమాదంలో గాయపడిన వారిని దిబ్రూగర్‌లోని అసోం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.