యాప్నగరం

Guwahati జైల్లోనే ఉంటూ చదివాడు.. పీజీలో గోల్డ్ మెడల్ పట్టేశాడు!

నాలుగేళ్ల కిందట అసోం రాజధాని గువహటిలో ఉల్ఫా తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనుక ఓ విద్యార్ధి నేత ఉన్నట్టు ఎన్ఐఏ అనుమానించి అతడిపై కేసు పెట్టింది. అరెస్ట్ చేసి గౌహతి జైల్లో ఉంచింది. అతడు జైల్లో ఉన్నా చదువును కొనసాగించాలని భావించాడు. దీంతో ఓపెన్ వర్సిటీ కోర్సులో చేరి పరీక్షలకు హాజరై టాప్‌లో నిలిచాడు. గోల్డ్ మెడల్ అందుకున్నాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 4 Feb 2023, 9:13 am

ప్రధానాంశాలు:

  • 2019లో గువహటి నగరంలో పేలుళ్లు
  • నిందితుడిగా ఉన్న వర్సిటీ విద్యార్ధి
  • జైల్లో ఉండగానే పీజీ పరీక్షలకు హాజరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sanjib Talukdar
విచారణ ఖైదీగా ఉన్న ఓ యువకుడు.. జైల్లో ఉంటూనే పరీక్షలకు హాజరై డిస్టెక్షన్‌లో పాసయ్యాడు. పేలుళ్ల కేసులో నిందితుడిగా మాజీ విద్యార్థి నేత ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. 2019లో అసోం రాజధాని గువాహటిలో జరిగిన పేలుళ్ల కేసులో విద్యార్థి నేత సంజీబ్‌ తాలుక్‌దార్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో గువాహటి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, జైల్లో ఉన్నా చదువు కొనసాగించాలని భావించాడు. దీంతో కృష్ణ కాంత హండిక్యూ స్టేట్ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సులో చేరాడు.
ఫైనల్ ఇయర్ పరీక్షలను ఇటీవలే రాసి 71 శాతం మార్కులను సాధించి, మొదటి స్థానంలో నిలిచాడు. గవర్నరు జగదీశ్‌ ముఖి సంజీబ్‌కి గురువారం గోల్డ్‌ మెడల్‌‌ను బహూకరించారు. వాస్తవానికి బోటనీలోనే ఎంఫిల్ చేయాలని భావించినా.. జైల్లో ల్యాబ్ సౌకర్యం లేకపోవడంలో సోషియాలజీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. గువహటి పేలుళ్ల కేసులో సంజీవ్‌తో పాటు మరో ముగ్గురిపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఎన్ఐఏ కేసు నమోదుచేసింది. అరెస్ట్ అనంతరం గువహటి జైలులో ఉంచారు.

జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ.. సంజీబ్‌కు కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువని అన్నారు. సోదరి డాలీ మాట్లాడుతూ.. తన సోదరుడి బెయిల్ పిటిషన్‌పై గువహటి హైకోర్టు విచారణ చేపట్టనుందని తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రకాశ్ రాజ్‌కోన్వార్‌కు హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అరెస్టయ్యే నాటికి సంజీబ్‌ గువహటి విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ను చేస్తున్నాడని ఆమె చెప్పారు. జైల్లో ఉండటం వల్ల కొనసాగలేదని పేర్కొన్నారు. గతంలో అదే వర్సిటీ పీజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.