యాప్నగరం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 20మంది మృతి, తీవ్ర విషాదం

ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Jul 2022, 10:40 am

ప్రధానాంశాలు:

  • హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • 20మంది వరకు చనిపోయినట్లు సమాచారం
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu హిమాచల్ ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులూ జిల్లాలో ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు ఎక్కువమంది ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసంకాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.