యాప్నగరం

జమ్మూకశ్మీర్ సమస్య.. వాజ్‌పేయి చెప్పిన పరిష్కారం

జమ్మూకశ్మీర్ విషయంలో ఇన్సానియత్ (మానవత్వం), జమ్‌హురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీరీ సంస్కృతి) అనే మూడు సూత్రాల ఆధారంగా ముందడుగు వేసి సమస్యను పరిష్కరించ్చు.

Samayam Telugu 16 Aug 2018, 7:16 pm
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం (ఆగస్టు 16) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఇక లేరని తెలిసి దేశమంతా దుఃఖంలో ముగినిపోయింది. దేశ రాజకీయాల్లో భీష్ముడిగా పేరొందిన వాజ్‌పేయి బీజేపీ నుంచి పనిచేసిన తొలి ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. దేశ ప్రధానిగా పూర్తికాలం (ఐదేళ్లు) పనిచేసిన కాంగ్రెస్సేతర వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1996 నుంచి 2004 వరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా విధులు నిర్వహించారు.
Samayam Telugu atal-pervez


అయితే.. బుధవారం (ఆగస్టు) జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ వాజ్‌పేయిని గుర్తుచేసుకున్నారు. 'జమ్మూకశ్మీర్ విషయంలో ఇన్సానియత్ (మానవత్వం), జమ్‌హురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీరీ సంస్కృతి) అనే మూడు సూత్రాల ఆధారంగా ముందడుగు వేసి సమస్యను పరిష్కరించగలమని.. ప్రజలను అక్కున చేర్చుకోవడం ద్వారానే జమ్మూకశ్మీర్ సమస్య పరిష్కారమవుతుంది' అని వాజ్‌పేయి చెప్పేవారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.