యాప్నగరం

Atiq Ahmed Killers: రిపోర్టింగ్‌లో క్రాష్ కోర్సు.. సహకరించిన ముగ్గురు విలేకర్లు.. వెలుగులోకి సంచలన విషయాలు

Atiq Ahmed Killers యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో యూపీలో ఎన్‌కౌంటర్‌ డెత్‌ నెంబర్‌ 183 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాఫియా డాన్‌ అతీక్‌ కుమారుడు అసద్‌ను ఝాన్సీ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోపే దాదాపు 100కు పైగా కేసుల్లో నిందితులైన అతీక్‌, అతడి సోదరుడు అష్రఫ్‌లు అనూహ్యంగా హత్యకు గురయ్యారు. ఫలితంగా ఓ దిగ్గజ మాఫియా సామ్రాజ్యం పునాదులు కదిలిపోయాయి. పోలీసుల కస్టడీలో ఉన్నవారు హత్యకు గురికావడం విమర్శలకు దారితీస్తోంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 20 Apr 2023, 12:01 pm

ప్రధానాంశాలు:

  • పోలీసుల ఎదుటే అతీక్ అహ్మద్ సోదరులపై కాల్పులు
  • స్థానిక వెబ్‌సైట్‌లో పనిచేస్తోన్న ముగ్గురు జర్నలిస్ట్‌లు
  • షయిస్త్ పర్వీన్ నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Atiq Killers
ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగస్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్య కేసుపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జర్నలిస్ట్‌లా నటిస్తూ అతీక్ సోదరులను నిందితులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడికి స్థానిక జర్నలిస్ట్‌లు ముగ్గురు సహకరించినట్టు తాజాగా బయటకు వచ్చింది. నిందితులకు సహకరించిన ముగ్గుర్నీ అరెస్ట్ చేశామని పోలీసులు గురువారం వెల్లడించారు. హంతకులు లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య. సన్నీ సింగ్‌లు కెమెరాలు, డజన్ల కొద్దీ పోలీసుల ముందు అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను కాల్చడానికి ముందు మొత్తం రోజంతా జర్నలిస్టులుగా శిక్షణ తీసుకున్నట్టు పేర్కొన్నారు.
స్థానిక న్యూస్ వెబ్‌సైట్‌లో పనిచేస్తోన్న ముగ్గుర్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ లవ్లేశ్ తివారీకి రిపోర్టింగ్‌లో మెలకువలు నేర్పించినట్టు తెలిపారు. మరోవైపు, కౌశాంబిలో అతిక్ అహ్మద్ భార్య షయిస్తా పర్వీన్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

‘‘అతీక్ అహ్మద్ భార్య షయిస్తా పర్వీన్ నివాసంలో సోదాలు నిర్వహించారు.. ఆ ఇంటిలో కొంతమంది నేరస్థులు దాక్కున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టాం.. ఈ ఆపరేషన్ 2 గంటల పాటు కొనసాగింది.. డ్రోన్ కెమెరాను కూడా వినియోగించాం.. అయితే, పర్వీన్ నివాసంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు’ అని సీనియర్ పోలీస్ అధికారి సమర్ బహదూర్ తెలిపారు.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను శనివారం రాత్రి జైలు నుంచి వైద్య పరీక్షలకు తరలించిన సమయంలో నిందితులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అతీక్ సోదరులను చుట్టుముట్టిన నిందితులు.. 22 సెకెన్లలో 14 రౌండ్లు కాల్పులు జరిపారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.