యాప్నగరం

సుప్రీంకోర్టు తీర్పు వారికో హెచ్చరిక!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని

Samayam Telugu 15 Feb 2017, 12:46 pm
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభివర్ణించారు. ఈ తీర్పు అవినీతి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తుందని ఆయన అన్నారు.
Samayam Telugu attorney general lauds sc for firm verdict on corrupt sasikala
సుప్రీంకోర్టు తీర్పు వారికో హెచ్చరిక!


అక్రమాస్తుల కేసులు శశికళతో పాటు జయ (లేట్), ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లను దోషులుగా తేల్చుతూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

‘‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. అవినీతి ఏ రూపంలోనే సహించలేది లేదని సుప్రీంకోర్టు ఈ తీర్పుతో స్పష్టం చేసింది’’ అని రోహత్గీ అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లేక బలనిరూపణ కోసం ఎవరిని పిలవకుండా వేచి చూసే ధోరణి అవలంభించిన గవర్నర్ సముచిత నిర్ణయమే తీసుకున్నారని రోహత్గీ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ తన విచక్షణాధికారంతో బలనిరూపణకు పిలవవచ్చని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడులో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు రెండు రోజుల్లో తొలగిపోనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.