యాప్నగరం

కేరళ వరదలు: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పంబా నది..

కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి... భారీగా వరదనీరు చేరడంతో పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం భారీగా పెరగడంతో శబరిమలకు వెళ్లే రెండు వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది.

Samayam Telugu 17 Aug 2018, 12:48 pm
కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి... భారీగా వరదనీరు చేరడంతో పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం భారీగా పెరగడంతో శబరిమలకు వెళ్లే రెండు వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. శబరిమల ఆలయ పరిసరాల్లోని శిబిరాల్లోకి కూడా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆలయం చరిత్రలో తొలిసారిగా బుధవారం (ఆగస్టు 14) ఉదయం తంత్రీ లేకుండానే 'నిరపుతరి' వేడుకలు నిర్వహించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఆలయం మూసివేశారు.
Samayam Telugu Pampa1

మలయాళం కొత్త నెల ప్రారంభంలో సందర్భంగా ఆలయం తెరిచి ఉంటుంది. ఓనం పండుగను తిరిగి ప్రారంభించే ముందు ఐదు రోజుల తర్వాత ఇది మళ్లీ మూసివేయబడుతుంది. కానీ, కనీవినీ ఎరుగని వర్షాలతో శబరిగిరులకు వెళ్లడం అసాధ్యమైపోయింది. అటవీ మార్గం వెంట అనేక ప్రదేశాల్లో చెట్లు కూలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పంబాకు బస్సు సర్వీలు కూడా నిలిపిపోయాయి. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. యాత్రికులు శబరిమలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.