యాప్నగరం

ఆటోవాలా నిజాయితీ.. రూ.5 లక్షలు తిరిగి అప్పగించాడు!

తన వాహనంలో ఎక్కిన ప్రయాణికులు ఎవరైనా లక్షల రూపాయాల నగదును మరిచిపోతే ఏం చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా దాచేస్తారు. కానీ ఈ ఆటోడ్రైవర్ మాత్రం అలాగే చేయలేదు

Samayam Telugu 3 Aug 2018, 2:05 pm
తన వాహనంలో ఎక్కిన ప్రయాణికులు ఎవరైనా లక్షల రూపాయాల నగదును మరిచిపోతే ఏం చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా దాచేస్తారు. కానీ ఈ ఆటోడ్రైవర్ మాత్రం అలాగే చేయలేదు. ప్రయాణికుడు మరిచిపోయినా రూ.5 లక్షల నగదు తిరిగి అతడికి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. పేదవాడైనా ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా వ్యక్తిత్వంలో తాను ధనవంతుడునేని నిరూపించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో కోంధ్వాలో చోటుచేసుకుంది. ప్రకాశ్ మోతీరాం కరంచందనీ (72) అనే వ్యక్తి గురువారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో మార్కెట్‌యార్డ్ నుంచి తన ఇంటికి ఆటోలో వచ్చాడు. అయితే, తనతోపాటు తెచ్చిన రూ.5 లక్షలు నగదు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి దిగిపోయాడు.
Samayam Telugu ఆటో డ్రైవర్ నిజాయితీ


దీన్ని డ్రైవర్ మారుతీ దగడు వాఘ్‌మేరే (60) కూడా గమనించలేదు. అక్కడ నుంచి ఆటోకు గ్యాస్ నింపడానికి ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న క్యారీబాగు అతడి కంటపడింది. దీన్ని పరిశీలించగా అందులో రూ.5 లక్షలు ఉన్నట్టు గుర్తించాడు. దీంతో వెంటనే ప్రకాశ్ మోతీరాం ఇంటికి వెళ్లి నగదు సంచిని వారికి అప్పగించాడు. అప్పటికే ప్రకాశ్ డబ్బు సంచిని ఆటోలో మరిచిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ మారుతీ డబ్బులు తీసుకొచ్చిన విషయం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రకాశ్‌కు తెలియజేశారు. నిజాయితీతో డబ్బును అప్పగించిన మారుతిని పోలీసులు అభినందించారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతడిని శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.

Read This Story in Maharashtra Times

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.