యాప్నగరం

ఇండిగో సిబ్బంది తీరు బాధాకరం: కేంద్ర మంత్రి

ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాడిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్రంగా ఖండించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఇండిగో సంస్థ, డీజీసీఏను మంత్రి ఆదేశించారు. నివేదిక రాగానే ఇండిగో సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

TNN 8 Nov 2017, 4:24 pm
ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాడిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్రంగా ఖండించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఇండిగో సంస్థ, డీజీసీఏను మంత్రి ఆదేశించారు. నివేదిక రాగానే ఇండిగో సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘ప్రయాణికుడితో ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరం. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. ప్రయాణికుల రక్షణే మా బాధ్యత’ అని అశోక్‌ గజపతిరాజు అన్నారు.
Samayam Telugu aviation minister ashok gajapathi raju condemns indigo passenger assault incident
ఇండిగో సిబ్బంది తీరు బాధాకరం: కేంద్ర మంత్రి


ఢిల్లీ విమానాశ్రయంలో రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాడి చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న ఆయన ఇండిగోకు చెందిన ఓ విమానంలో చెన్నై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. టెర్నినల్ దగ్గరకి వెళ్లడానికి ఇండిగో బస్సు ఎక్కుతున్న రాజీవ్‌ను గ్రౌండ్ స్టాఫ్ అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగిన రాజీవ్.. బలవంతంగా బస్సు ఎక్కబోయారు. దీంతో ఆయణ్ని అక్కడే కింద పడేసి కొట్టారు.

అక్కడే ఉన్న మరో ఇండిగో ఉద్యోగి ఈ తతంగాన్ని వీడియో తీయడం గమనార్హం. బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు పట్ల ఇండిగో సిబ్బంది ఒకరు అమర్యాదగా ప్రవర్తించిన వివాదం కొనసాగుతుండగానే మరోసారి అలాంటి ఉదంతమే బయటపడటంతో.. ఈ ప్రభుత్వ రంగ సంస్థపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.