యాప్నగరం

సయోధ్యతోనే అయోధ్యకు పరిష్కారం: యోగి

సయోధ్యతోనే అయోధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 3 Apr 2017, 2:27 pm
సయోధ్యతోనే అయోధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలా? లేక కూల్చి వేసిన బాబ్రీ మసీదును పునర్నిర్మించాలా? అన్న అంశంపై చాలాఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ సమస్యను ఇరు వర్గాలు (హిందువులు, ముస్లింలు) సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.
Samayam Telugu ayodhya issue will be solved through talks yogi
సయోధ్యతోనే అయోధ్యకు పరిష్కారం: యోగి


యూపీ సీఎంగా ప్రమాణం చేశాక యోగి తొలిసారిగా ఆరెస్సెస్ పత్రిక ‘పంచజన్య’కు ఇంటర్య్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు అయోధ్యపై వెలిబుచ్చిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. చర్చల ద్వారా అయోధ్య సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఇరు వర్గాలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని యోగి తెలిపారు.

మాంసాహారం కంటే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పిన యోగి.. తాను ఎవరి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని చెప్పడం లేదని అన్నారు. అక్రమ కబేళాలను మాత్రమే తమ ప్రభుత్వం తొలగించేలా చర్యలు చేపట్టిందని వివరణ ఇచ్చారు.
తమ ప్రభుత్వం ఎవరి వ్యక్తిగత విషయాలను జోలికి వెళ్లబోదని, భారత రాజ్యాంగం హక్కులు, స్వేచ్ఛ కల్పించిందని అయితే వాటికి పరిమితులు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడేది లేదన్న యోగి.. తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలే మాట్లాడతాయని పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.