యాప్నగరం

రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లు చూస్తున్న పూజారి సహా 16 మందికి కరోనా పాజిటివ్

సుప్రీంకోర్టు తీర్పుతో శతాబ్దాల వివాదానికి తెరపడటంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న అట్టహాసంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Samayam Telugu 30 Jul 2020, 3:13 pm
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండగా.. కోవిడ్ కలకలం రేగింది. రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా ర్ధారణ అయింది. శంకుస్థాపన కార్యక్రమం సన్నాహాల్లో ఈయన పాల్గొంటున్నారు. ఆయనతోపాటు రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులు కూడా కరోనా వైరస్ నిర్దారణ కావడంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు.
Samayam Telugu అయోధ్య రామమందిరం
Ayodhya Ram Mandir


ఆగస్టు 5న మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పూజారికే కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు వీఐపీలు రానున్నట్టు తెలుస్తోంది. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అయితే, ఆలయ ప్రాంగణంలో 2 వందల అడుగుల లోతులో రాగి రేకుతో రూపొందించిన కాలనాళిక (టైమ్‌ క్యాప్సూల్‌)ను నిక్షిప్తం చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, ప్రచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తోసిపుచ్చింది. రెండు రోజులుగా మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం లేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ మంగళవారం స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.