యాప్నగరం

మే 30లోపు హాజరుకండి: అద్వానీకి ఆదేశాలు

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో విచారణకు ఈ నెల 30లోపు తన ముందు హాజరుకావాలని బీజేపీ అగ్రనేతలు

TNN 25 May 2017, 3:49 pm
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో విచారణకు ఈ నెల 30లోపు తన ముందు హాజరుకావాలని బీజేపీ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషిలకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేశారు. వీరంతా వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని తెలిపింది.
Samayam Telugu babri demolition case special cbi court orders lk advani and others to appear it on may 30
మే 30లోపు హాజరుకండి: అద్వానీకి ఆదేశాలు


1992 డిసెంబర్ 6 న జరిగిన విధ్వంసం వెనుక బీజేపీ నేతల కుట్ర దాగి ఉందని సీబీఐ కేసు నమోదు చేసింది. నేతల విద్వేషపూరిత ప్రసంగాల వల్లే కరసేవకులు మసీదుపై దాడి చేసిన కూల్చేశారని అభియోగాలు మోపింది. నేతల ప్రమేయంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ సహా 13మందిపై రెండు ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.