అయోధ్య వివాదంపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య విషయంలో వాస్తవాల ఆధారంగానే సుప్రీం తీర్పు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేసిన ఒవైసీ, ఆ ప్రాంతలోనే మసీదు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘దైవానుగ్రహంతో సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే అదే ప్రాంతంలో మసీదు నిర్మిస్తాం... ఎందుకంటే మా మసీదు అక్కడ ఉండేది. వాస్తవాల ఆధారంగానే కోర్టు తీర్పు ఉంటుంది తప్ప మత విశ్వాసాల ఆధారంగా కాదని’ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలన్న డిమాండ్ను ముస్లింలు వదిలిపెట్టబోరని ఒవైసీ పేర్కొన్నారు.
‘మాపై బెదిరింపులకు పాల్పడుతూ, ఆ స్థలాన్ని విడిచి వెళ్లాలని మాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెబుతున్నది ఒక్కటే.. మేం మా మసీదును వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అన్నారు. అలాగే కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మమ్మల్ని పాకిస్థానీలంటున్న వారిని ప్రశ్నించేది ఒక్కటే, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీలు ముస్లింలా? వారు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. హిందూ- ముస్లిం భాయ్ అనే సిద్దాంతాన్ని తాము నమ్ముతుంటే, మాకు మాత్రం వారి నుంచి ఎలాంటి సహాయం అందడంలేదని.. భారత్ లో ముస్లింలు రెండో రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఇప్పుడు హిందుత్వవైపు మళ్లుతోందని ఆరోపించారు. కశ్మీర్లో తీవ్రవాద దాడులను ఎదుర్కోవడంలో బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. సుంజ్వాన్ ఉగ్రదాడిపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.
Yelog jo humko dara rahe hain, chahe hamari shariat ke khilaf aawaz utha rahe hain, chahe humko keh rahe hain ki masjid chod do, main unlogon se kehna chahta hu. Jo hamse kehte hain ki masjid ko chod do, nahi, hum hargiz apne masjid ko nahi chodenge: Asaduddin Owaisi pic.twitter.com/1AzOr85MIP — ANI (@ANI) February 24, 2018
‘మాపై బెదిరింపులకు పాల్పడుతూ, ఆ స్థలాన్ని విడిచి వెళ్లాలని మాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెబుతున్నది ఒక్కటే.. మేం మా మసీదును వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అన్నారు. అలాగే కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మమ్మల్ని పాకిస్థానీలంటున్న వారిని ప్రశ్నించేది ఒక్కటే, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీలు ముస్లింలా? వారు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. హిందూ- ముస్లిం భాయ్ అనే సిద్దాంతాన్ని తాము నమ్ముతుంటే, మాకు మాత్రం వారి నుంచి ఎలాంటి సహాయం అందడంలేదని.. భారత్ లో ముస్లింలు రెండో రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఇప్పుడు హిందుత్వవైపు మళ్లుతోందని ఆరోపించారు. కశ్మీర్లో తీవ్రవాద దాడులను ఎదుర్కోవడంలో బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. సుంజ్వాన్ ఉగ్రదాడిపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.
Yelog jo humko dara rahe hain, chahe hamari shariat ke khilaf aawaz utha rahe hain, chahe humko keh rahe hain ki masjid chod do, main unlogon se kehna chahta hu. Jo hamse kehte hain ki masjid ko chod do, nahi, hum hargiz apne masjid ko nahi chodenge: Asaduddin Owaisi pic.twitter.com/1AzOr85MIP — ANI (@ANI) February 24, 2018