యాప్నగరం

తాజ్‌మహల్ పై మరో వివాదం..!

ఉత్తరప్రదేశ్ రాజకీయ నేతలు, యూపీ జనాలు ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ విషయంలో వివాదాలు రాజేస్తూనే ఉన్నారు.

TNN 27 Oct 2017, 3:08 pm
ఉత్తరప్రదేశ్ రాజకీయ నేతలు, యూపీ జనాలు ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ విషయంలో వివాదాలు రాజేస్తూనే ఉన్నారు. తాజ్ భారత చరిత్రలో మాయని మరక అని అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరు వ్యాఖ్యానించడం, ఆపై తాజ్ మహల్ పూర్వకాలంలో ఒక శివాలయం అని మరో బీజేపీ నేత వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజ్ మహల్ విషయంలో స్పందించడం జరిగింది. తాజ్ భారతీయుల చెమట, రక్తాలతో నిర్మితమైనదని యోగి వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్ ను సందర్శించి అక్కడ స్వచ్ఛభారత్ నిర్వహించారు యోగి.
Samayam Telugu ban namaz at taj mahal demands rss history wing
తాజ్‌మహల్ పై మరో వివాదం..!


అదలా ఉంటే.. తాజ్ మహల్ వద్ద ముస్లింలు నమాజ్ చేయడాన్ని నిషేధించాలని యూపీ ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ వచ్చిందిప్పుడు. ఈ డిమాండ్ ను చేసినది అఖిల భారతీయ ఇతిమాస్‌ సంకల్ప సమితి (ఏకేబీఐఎస్‌ఎస్‌). ఇది రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ. ఈ నేపథ్యంలో దీని డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజ్‌మహల్ వద్ద ముస్లింలు ప్రార్థనలు చేస్తుంటారని, తాజ్ ఏదో ఒక మతానికి చెందినది కాదు, అది దేశానిది అని.. అక్కడ ముస్లింలు ఎలా నమాజ్ చేస్తారని ఈ సంస్థ ప్రశ్నించింది. తాజ్‌మహల్ హిందువుల కట్టడం అని, అదొక శివాలయం అని.. దాన్ని కూలగొట్టి తాజ్‌మహల్ గా మార్చారని.. కాబట్టి అక్కడ హిందువులు పూజలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.

ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నుంచి ఇలాంటి డిమాండ్ రావడంతో యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.