యాప్నగరం

దేశ రాజధానిలో డీజిల్ వాహనాలకు నో

దేశ రాజధాని కొత్త ఢిల్లీలో డీజిల్ వాహనాలపై ఉన్న నిషేధం కొనసాగుతుందని సుప్రీం కోర్ట్ చెప్పింది

TNN 1 May 2016, 8:33 pm
దేశ రాజధాని కొత్త ఢిల్లీలో డీజిల్ వాహనాలపై ఉన్న నిషేధం తన విచారణ పూర్తయ్యి నిర్ణయం వెలువడే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్ట్ చెప్పింది. దేశ రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో కాలుష్యం మితిమీరి పోయిన తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. సరి-బేసి విధానం వాటిల్లో ఒకటి కాగా, కాలుష్యానికి విపరీతంగా కారకమయ్యే డీజిల్ వాహనాల నిషేధ అంశంపై ఎప్పటినుండో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంలో జరిగింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9వ తేదీకీ వాయిదా వేసింది. తన నిర్ణయం వెలువడే వరకు గతంలో ఉన్న మాదిరిగానే నిషేధం కొనసాగుతుందని చెప్పింది. ఇదిలా ఉండగా ఈ నిషేధం వల్ల తమ డీజిల్ వాహనాలు ఆగిపోయి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ట్యాక్సీ ఆపరేటర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తమ వాహనాలను సీఎన్జీగా మార్చుకోవడానికి మరింత గడువు కావాలని అభ్యర్ధించగా కోర్టు నిరాకరించింది. ఇప్పటికే చాలామార్లు వారికి గడువు ఇచ్చినందున ఇకపై కుదరదని చెప్పింది.
Samayam Telugu ban on diesel vehicles in delhi to continue
దేశ రాజధానిలో డీజిల్ వాహనాలకు నో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.