యాప్నగరం

భార్యను చంపిన రియల్టర్.. ముగ్గురు పిల్లలతో పరార్

భార్యాభర్తలన్నాక చిన్న, చిన్న గొడవలు సర్వ సాధారణం. ఉదయం గొడవపడినా సాయంత్రానికి మళ్లీ ఒకటైపోతుంటారు. కాని బెంగళూరులో ఓ రియల్టర్ మాత్రం కుటుంబ కలహాలతో భార్యనే చంపేశాడు.

Samayam Telugu 22 Jun 2018, 10:10 am
భార్యాభర్తలన్నాక చిన్న, చిన్న గొడవలు సర్వ సాధారణం. ఉదయం గొడవపడినా సాయంత్రానికి మళ్లీ ఒకటైపోతుంటారు. కాని బెంగళూరులో ఓ రియల్టర్ మాత్రం కుటుంబ కలహాలతో భార్యనే చంపేశాడు. ముగ్గురు పిల్లల్ని తీసుకొని పారిపోయాడు. జయానగర్‌కు చెందిన గణేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి ఇంట్లో నుంచి తుపాకీ పేలిన శబ్ధం వచ్చింది. అనుమానం రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu Gun Fire


పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తీసి చూడగా గణేష్ భార్య సహానా రక్తపు మడుగులో పడి ఉంది. ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో భర్తే చంపి ముగ్గురు పిల్లలతో పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా గణేష్ భార్యతో గొడవలు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా గొడవ జరిగి ఉంటుందని అందుకే హత్య చేసి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడికి లైసెన్స్డ్ గన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ కోసం గాలిస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.