సామాజిక మాధ్యమాల్లో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుడ్ని వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న ఓ యువతి దుస్సాహసమే చేసింది. పొరుగు దేశంలో ఉన్న తన ప్రియుడు కోసం పులులకు ప్రసిద్ది చెందిన అడవుల గుండా ఒంటరిగా ప్రయాణించి, నదిని ఈదుకుంటూ గమ్యానికి చేరుకుంది. ఈ ఘటన భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన క్రిష్ట మండల్ అనే 22 ఏళ్ల యువతికి ఆరు నెలల కిందట ఫేస్బుక్లో కోల్కతా యువకుడు అభిక్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో అతడినే వివాహం చేసుకోవాలని క్రిష్ట నిర్ణయించుకుంది. దీంతో కోల్కతాలో ఉంటున్న ప్రియుడి కోసం సరిహద్దులో ఉన్న గంగా నదిని ఈదుకుంటూ భారత్లోకి అడుగుపెట్టింది. రాయల్ బెంగాల్ టైగర్స్కు ప్రసిద్ధి చెందిన సుందర్బన్ మడ అడవుల గుండా ఒంటరిగా, ధైర్యంగా ప్రయాణించి ప్రియుడ్ని చేరుకుంది. పాస్పోర్ట్ లేకపోవడంతో అక్రమ మార్గంలో భారత్లోకి ప్రవేశించాలని యువతి భావించింది. దీంతో సరిహద్దులో ఉన్న నదిని దాదాపు గంటపాటూ ఈదుకుంటూ ప్రవేశించింది.
మూడు రోజుల కిందట అభిక్ మండల్ను క్రిష్ణ పెళ్లాడింది. కోల్కతాలోని కాళీఘట్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అయితే, అనుమతి లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. క్రిష్ట మండల్ది బంగ్లాదేశ్లోకి సత్ఖిరాగా గుర్తించారు. దీంతో ఆమె బంగ్లాదేశ్ హై కమిషన్కు అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అభిక్ కుటుంబసభ్యులు మాత్రం దీనిపై నోరువిప్పడం లేదు.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్కు చెందిన ఇమాన్ హుసేన్ అనే టీనేజర్ తనకిష్టమైన చాక్లెట్ కోసం భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ చొరబాటుని గుర్తించిన స్థానికులు టీనేజర్ హుసేన్ను పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.
మూడు రోజుల కిందట అభిక్ మండల్ను క్రిష్ణ పెళ్లాడింది. కోల్కతాలోని కాళీఘట్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అయితే, అనుమతి లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. క్రిష్ట మండల్ది బంగ్లాదేశ్లోకి సత్ఖిరాగా గుర్తించారు. దీంతో ఆమె బంగ్లాదేశ్ హై కమిషన్కు అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అభిక్ కుటుంబసభ్యులు మాత్రం దీనిపై నోరువిప్పడం లేదు.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్కు చెందిన ఇమాన్ హుసేన్ అనే టీనేజర్ తనకిష్టమైన చాక్లెట్ కోసం భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ చొరబాటుని గుర్తించిన స్థానికులు టీనేజర్ హుసేన్ను పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.