యాప్నగరం

బ్యాంకులు, టెల్కోలకు ఆధార్‌ తప్పనిసరే: జైట్లీ

పార్లమెంట్‌ ఆమోదం పొందిన చట్టం ద్వారా బ్యాంకులు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానాన్ని తిరిగి తప్పనిసరి చేయొచ్చని పేర్కొన్నారు.

Samayam Telugu 7 Oct 2018, 12:19 pm
బ్యాంకులు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం తప్పనిసరి అంటున్నారు. శనివారం (అక్టోబరు 6) జరిగిన 'హెచ్‌టీ నాయకత్వ సదస్సు'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఆమోదం పొందిన చట్టం ద్వారా బ్యాంకులు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానాన్ని తిరిగి తప్పనిసరి చేయొచ్చని పేర్కొన్నారు.
Samayam Telugu arun-jaitley


టెలికాం సేవలు పొందేందుకు ఆయా సంస్థలకు ఆధార్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జైట్లీ.. ఇదో కఠినమైన తీర్పు అని అభిప్రాయపడ్డారు. ‘ఆధార్‌ అనేది పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు. ప్రభుత్వం అందించే ఎన్నో సబ్సిడీలు, ఇతర సహాయాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌ అసలు ప్రయోజనం అదే’ అని అన్నారు.

ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించకూడదనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పు ఇచ్చిందని జైట్లీ అన్నారు. అయితే, సెక్షన్‌ 57 ప్రకారం చట్టం ద్వారా లేదా, ఏదైనా ఒప్పందం ప్రకారం ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలి. చట్టం ప్రకారం ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయొచ్చని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.