యాప్నగరం

మా వల్లే మీ భర్త చనిపోయాడు.. క్షమించండి

Bengaluru: కరోనా రోగి భార్యకు చేతులెత్తి దండం పెడుతూ క్షమాపణ కోరిన బెంగళూరు కార్పొరేషన్ కమిషనర్. తప్పులు అందరూ చేస్తారు. కానీ, ఆ తప్పును నిజాయతీగా ఒప్పుకొని క్షమాపణ కోరడానికి ధైర్యం కావాలి. అందుకే ఇప్పుడు ఈ ఐఏఎస్ వైరల్ అవుతున్నారు.

Samayam Telugu 8 Jul 2020, 8:08 pm
ఫోటోలో ఇంటి గుమ్మం ముందు నిల్చుని, చేతులు జోడించి దండం పెడుతున్న వ్యక్తి ఓ ఐఏఎస్ ఆఫీసర్, బెంగళూరు కార్పొరేషన్ కమిషనర్. ఆయన ఎదురుగా ఉన్నది భర్తను కోల్పోయిన ఓ ఇల్లాలు. ఆవిడ భర్త(55)కు ఇటీవల కరోనా సోకింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నాడు. జులై 3న ఆయన తనకు ఊపిరి అందట్లేదని చెప్పడంతో ఇంట్లో వాళ్లు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. రెండు గంటలు గడిచినా అంబులెన్స్ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆయణ్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నడి రోడ్డుమీదే ఆయన ప్రాణాలు గాల్లో కలిశాయి.
Samayam Telugu కరోనా మృతుడి భార్యకు దండం పెడుతున్న కమిషనర్
Bengaluru Commisssioner Apologises Covid Victim's Wife


అంబులెన్స్ సమయానికి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తప్పులు అందరూ చేస్తారు. కానీ, నిజాయతీగా తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరడానికి ధైర్యం కావాలి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ సరిగ్గా అదే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పైగా తన సిబ్బంది వల్ల జరిగిన పొరపాటుకు ఆయన క్షమాపణ కోరడం గమనార్హం. ఆయన పేరు బీహెచ్ అనిల్ కుమార్, ఐఏఎస్. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కమిషనర్.

బాధిత కుటుంబాన్ని కలిసి క్షమాపణ కోరినట్లు కమిషనర్ అనిల్ కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. ‘సమయానికి స్పందిచకపోవడంతో రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన కరోనా బాధితుడి కుటుంబసభ్యులను గవీపురంలోని ఆయన నివాసంలో కలిశాను. మా సిబ్బంది తరఫున అన్‌కండీషనల్‌గా క్షమాపణ కోరాను’ అని ఆయన పేర్కొన్నారు.

ఇకపై ఇలాంటి పరిస్థితుల్లో తమ సిబ్బంది మరింత మెరుగ్గా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. కొవిడ్ రోగులను, వారి కుటుంబసభ్యులను అవమానించవద్దని నగర పౌరులను ఆయన విజ్ఞప్తి చేశారు.

Photo Credit: Twitter - Anil Kumar, IAS


Must Read: రక్తదానం దానం చేసిన శునకం.. రియల్ హీరో

Don't Miss: గల్వాన్ ఘర్షణ: అమర జవాన్లకు సంబంధించి షాకింగ్ నిజాలు

Also Read: కుల్‌భూషణ్ జాదవ్‌‌పై పాక్ కొత్త కుట్ర.. ఉరి వేయించడానికేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.