యాప్నగరం

చిన్నమ్మ కోసం జైలు నిబంధనలు హుష్ కాకి!

అక్రమాస్తుల కేసులో దోషి... బెంగళూరులోని పరప్పన అగ్రహర జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన

Samayam Telugu 5 Apr 2017, 5:41 pm
అక్రమాస్తుల కేసులో దోషి... బెంగళూరులోని పరప్పన అగ్రహర జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు రాజ మర్యాదలు జరుగుతున్నాయి. ఆమెతో పాటు ఇదే జైల్లో ఉన్న ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లు కూడా వీఐపీలుగా అన్ని మర్యాదలను ఎంజాయ్ చేస్తున్నారు.
Samayam Telugu bengaluru jail rules violated for vvip vk sasikala
చిన్నమ్మ కోసం జైలు నిబంధనలు హుష్ కాకి!


జైలు నిబంధనల ప్రకారం దోషిగా శిక్షను అనుభవిస్తున్న వారు 15 రోజులకొకసారి, విచారణ నిమిత్తం జైల్లో ఉన్నవారు వారం రోజులకొకసారి తన బంధువులు, స్నేహితులు, న్యాయవాదులను కలిసేందుకు అనుమతిస్తారు. అది కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే.

కానీ శశికళతోపాటు ఆమె బంధువుల విషయంలో మాత్రం జైలు అధికారులు ఇలాంటి నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరీముఖ్యంగా శశికలను దాదాపు ప్రతి రోజు ఎవరో ఒకరు కలుస్తున్నారు. శశికళను కలవడానికి వచ్చిన వారికి అధికారులుల ఇట్టే అనుమతి ఇస్తున్నారు.

ఫిబ్రవరి 16, 2017 నుంచి మార్చి 18, 2017 మధ్య కాలం (దాదాపు నెల సమయం)లో శశికళలను 27 మంది కలిసినట్లు ‘ఇండియా టు డే’ వెల్లడించింది. ఆమెను కలిసిన వారిలో టీటీవీ దినకరన్ సహా, అన్నాడీఎంకే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు, మన్నార్ గుడి ప్రాంత వాసులున్నట్లు వెల్లడయ్యింది.

శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కలిసి వారిలో ఎంపీ తంబిదురై, ఎమ్మెల్యేలు వలర్మతి, గోకుల ఇందిర, సీఎస్ సరస్వతి వంటి వారున్నారు.

శశికళ ఉన్న గదిలో ఏసీ, టీవీ, మంచం కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.