యాప్నగరం

ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాల్సిందే.. వరదల్లోనూ వదల్లేదు.. కాఫీ షాపులోనే సెట్ చేశాడు

వర్షాలు, వరదల కారణంగా బెంగళూరులో (Bengaluru floods) ఆఫీసులు, ఇళ్లు నీట మునిగాయి. కానీ ఐటీ కంపెనీలు మాత్రం.. ఎలాగైనా పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారు. దాంతో ఓ ఉద్యోగి చాలా కొత్తగా ఆలోచించాడు. పని చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీసు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా.. వర్క్ ఫ్రమ్ కాఫీ షాపును కనుగొన్నాడు. కాఫీ షాపు నుంచే పని చేయడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటో ట్విట్టర్‌లో దర్శమనమిచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 11 Sep 2022, 3:06 pm

ప్రధానాంశాలు:

  • బెంగళూరులో మునిగిన ఆఫీసులు, ఇళ్లు
  • నానా అవస్థలు పడుతున్న ఐటీ ఉద్యోగులు
  • కాఫీ షాప్‌‌నే ఆఫీసుగా మార్చేసిన వ్యక్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bengaluru Man in Coffee shop
Bengaluru floods: భారీ వర్షాలు, వరదలు బెంగళూరును అతలాకుతలం చేస్తున్నాయి. గతవారం రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా బెంగళూరు ఉక్కిరిబిక్కిరైంది. రహదారులు, ఇళ్లు, ఆఫీసులు నీట మునగడంతో.. బెంగళూరు వాసులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. కానీ కంపెనీల యజమానులు మాత్రం.. ఉద్యోగుల పట్ల ఏ మాత్రం కనికరం చూపడం లేదు. పరిస్థితి ఎలా ఉన్నా.. పని చేయాల్సిందేనంటున్నారు.
సాధారణంగా ఐటీ ఉద్యోగులు ట్రావెలింగ్ చేస్తూ కూడా పని నిర్వహిస్తుంటారు. అయితే ఎక్కడబడితే అక్కడ మోకాల్లోతు నీళ్లు ఉండిపోవడంతో ఎక్కడ నుంచి పని చేయాలన్నా కష్టతరంగానే ఉంది. ఇంట్లో, ఆఫీసుల్లో రోడ్డుపైనా ఇలా అన్ని దగ్గర్ల నీళ్లు చేరాయి. కానీ పని చేయాల్సిందేనన్న యజమానుల ఆదేశాలను.. ఉద్యోగులు పాటించాల్సిందే కదా.. అందుకే ఉద్యోగులు దీనికో భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఆఫీసులో పనిచేయడం గురించి తెలుసు.. కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అలవాటైంది. అయితే బెంగళూరుకు ఉద్యోగుల వల్ల ఇంకో కొత్త విధానం కూడా పరిచయం అయింది. అదే వర్క్ ఫ్రమ్ కాఫీ షాప్.


అవును ఓ ఉద్యోగి కాఫీ షాప్‌ నుంచి పనిచేస్తున్నాడు. బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ షాపులో కంప్యూటర్, టేబుల్ అన్ని పెట్టి.. పూర్తి ఆఫీసుగా మార్చేశాడు. ఆ కాఫీ షాపులో మరికొంతమంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ట్విట్టర్‌లో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఉద్యోగులు ఎక్కడన్నా సరే ల్యాప్‌టాప్‌లతో పనిచేయడం సహజమే. కానీ ఓ వ్యక్తి కాఫీ షాప్‌లో ఏకంగా డెస్క్‌టాప్, సీపీయూ‌లతో కంప్లీట్‌గా సెట్ చేసుకున్నాడు. ఇది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ పక్క వరదలు, మరోపక్క కంపెనీ యజమానుల పట్టుదలతో ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కొనసాగించడానికి చాలా దూరం వెళ్లవలసి ఉంటుంది. దాంతో వారు నానా అవస్థలు పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.