యాప్నగరం

సీఎంకు గిఫ్ట్ ఇచ్చిన మేయర్.. రూ.500 ఫైన్

Karnataka CM యడియూరప్పకు బెంగళూరు మేయర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పండ్లను ఆమె గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో నగర పాలక సంస్థ ఆమెకు రూ.500 ఫైన్ విధించింది.

Samayam Telugu 4 Aug 2019, 4:17 pm
ఇటీవల అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కూప్పకూలగా.. కర్ణాటక సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆపరేషన్ కమలం విజయవంతంగా పూర్తి కావడంతో.. బీజేపీ నేత యడియూరప్ప సీఎం పదవిని చేపట్టారు. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన యడ్డీకి శుభాకాంక్షలు చెప్పేందుకు నేతలు క్యూ కడుతున్నారు.
Samayam Telugu bnglr mayor1


బెంగళూరు మేయర్ గంగాబికే మల్లికార్జున్ కూడా యడియూరప్పకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఆమె రూ.500 ఫైన్ కట్టారు. సీఎంకు బహుమతిగా ఇవ్వడం కోసం పండ్లను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి తీసుకురావడమే దీనికి కారణం. 2016లో బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఇటీవల ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే.. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన బెంగళూరు మేయర్‌కు ఫైన్ వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.