యాప్నగరం

నగరంలో గాలి కాలుష్యం.. నియంత్రణకు సరికొత్త యంత్రం

నగరాల్లో గాలి కాలుష్యం ఊపిరి తీసుకోనివ్వట్లేదు. బెంగళూరు నగరం దీనికి సరికొత్త పరిష్కారం తీసుకొస్తోంది.

Samayam Telugu 31 Oct 2018, 10:13 pm
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యభూతం నగర జీవితాన్ని వణికిస్తున్న వేళ ఐటీ రాజధాని బెంగళూరులో కీలక ముందడుగేశారు. నగరంలోని కీలక ప్రాంతంలో ‘డస్ట్ ఈటర్స్’ యంత్రాలను అమర్చారు. గాలిలోని దుమ్ము, ధూళిని స్వాహా చేసి, స్వచ్ఛమైన గాలిని అందించే ఈ యంత్రాలను జర్మనీకి చెందిన మన్ హ్యూమల్ కంపెనీ సమకూర్చింది. ప్రాథమికంగా బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ యంత్రాలను గురువారం (నవంబర్ 1) ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు.
Samayam Telugu eaters


ప్రత్యేకతలివే..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ తోడ్పాడుతో ఈ డస్ట్ ఈటర్ యంత్రాలను రూపొందించారు. ఒక్కో యంత్రానికి మూడు బాక్సులు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ యంత్రం గాలిలో తేలియాడే ఘన వ్యర్థాలను, ఇతర కాలుష్య కారకాలను గ్రహిస్తుంది. తద్వారా గాలి స్వచ్ఛతను కాపాడుతుంది. ఒక్కో యంత్రం 200 మీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది. ఒక్కో యంత్రం బరువు 1.5 టన్నుల వరకు ఉంటుంది.

కర్ణాటక విధాన సౌధ, హైకోర్టు తదితర భవంతులు ఉన్న కీలక ప్రాంతంలో కబ్బన్ పార్క్‌ ఉంది. పార్క్‌లోని ఛామరాజేంద్ర వడయార్ విగ్రహం వద్ద ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జర్మనీ కంపెనీ సాయంతో.. పార్క్ వద్ద నుంచి విధాన సౌధ, హైకోర్టుకు వెళ్లడానికి ఎలక్ట్రికల్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా.. గాలి కాలుష్యం, ఊపిరితిత్తులపై దాని దుష్ప్రభావం తదితర అంశాలపై నిపుణులు విలువైన సూచనలు చేయనున్నారు. ఈ యంత్రాలను విజయవంతమైతే.. నగరంలో మరిన్ని ప్రదేశాల్లో నెలకొల్పడానికి అధికారులు కసర్తు చేస్తున్నారు.

Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.