పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి పోటీచేస్తున్న భవానీపూర్ ఉప-ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. ఎన్నిక యథావిధిగా కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి కింద భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ఈసీ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ పిల్పై విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తన వాదనలు వినిపించింది. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనే పదం అర్థాన్ని తప్పుగా వివరించడానికి పిటిషనర్ ప్రయత్నిస్తున్నాడని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదని అర్థం చేసుకోవాలని ఈసీ వివరించింది. బెంగాల్ ప్రభుత్వం కూడా సెప్టెంబరు 13న అఫిడ్విట్ దాఖలు చేస్తూ.. ఉప-ఎన్నికను నిర్వహించాలని మాత్రమే ఎన్నికల కమిషన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యర్ధించారని పేర్కొంది. ఉప ఎన్నికను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ బెంగాల్ చీఫ్ సెక్రటరీ లేఖ రాయడాన్ని కోర్టు తప్పుబట్టింది.
అయితే, ఎన్నికను మాత్రం రద్దుచేయడం కుదరదని, ఇందులో ఎటువంటి ఉల్లంఘన లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు 30న షెడ్యూల్ ప్రకారం పోలింగ్ నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్లో పోటీచేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చినా మమతా బెనర్జీ ఓటమిచూడటంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే సోవన్దేవ్ ఛటోపాధ్యాయ్, మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. ఈ స్థానంలో మమతా బెనర్జీకి ప్రత్యర్ధిగా ప్రియాంక టైబ్రివాల్ను బీజేపీ నిలబెట్టింది. సెప్టెంబరు 30 పోలింగ్ జరగనుండగా.. అక్టోబరు 3 ఫలితాలు వెల్లడికాానున్నాయి.
అయితే, ఎన్నికను మాత్రం రద్దుచేయడం కుదరదని, ఇందులో ఎటువంటి ఉల్లంఘన లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు 30న షెడ్యూల్ ప్రకారం పోలింగ్ నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్లో పోటీచేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చినా మమతా బెనర్జీ ఓటమిచూడటంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే సోవన్దేవ్ ఛటోపాధ్యాయ్, మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. ఈ స్థానంలో మమతా బెనర్జీకి ప్రత్యర్ధిగా ప్రియాంక టైబ్రివాల్ను బీజేపీ నిలబెట్టింది. సెప్టెంబరు 30 పోలింగ్ జరగనుండగా.. అక్టోబరు 3 ఫలితాలు వెల్లడికాానున్నాయి.