యాప్నగరం

Covaxin మూడో దశ ట్రయల్స్: ఆరోగ్య మంత్రికి తొలి డోసు.. త్వరలో గుడ్ న్యూస్

Haryana Health Minister Anil Vij: భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ టీకా తొలి డోసు తీసుకున్నారు.

Samayam Telugu 21 Nov 2020, 12:29 am
దేశ పౌరులు ఆశగా ఎదురుచూస్తున్న భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కరోనా వ్యాక్సిన్ Covaxin కీలకమైన మూడో దశ ట్రయ్సల్స్ శుక్రవారం (నవంబర్ 20) ప్రారంభమయ్యాయి. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తొలి టీకాను తీసుకున్నారు. అంబాలాలోని సివిల్ హాస్పిటల్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు.
Samayam Telugu భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్
Bharat Boitech Corona Vaccine Covaxin Third Phase clinical trials, Haryana Minister Anil Vij takes first shot


Must Read: క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ వ్యాక్సిన్.. భారత్‌లోనూ!

కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం తాను వాలంటీర్‌గా స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకున్నట్లు అనిల్ విజ్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంబాలా నుంచి హర్యానా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 67 ఏళ్ల ఈ బీజేపీ నేత.. రోహ్‌తక్‌లోని పీజీఐ నుంచి వచ్చిన డాక్టర్లతో పాటు హర్యానా ఆరోగ్య శాఖకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో కొవాగ్జిన్ టీకా డోసు తీసుకున్నారు.


హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశంలో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే.

ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు మొదట ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత 28 రోజులకు మరో ఇంజెక్షన్ ఇస్తారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భారత్ బయోటెక్ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తొలి రెండు దశల ట్రయల్స్‌లో వాలంటీర్లలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. మూడో దశ ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రయోగాలు విజయవంతమైనే వెంటనే డీసీజీఐ ఆమోదంతో ప్రజలకు పంపిణీ చేయనున్నారు. అంతకంటే ముందే అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: కరోనా‌కు ఏడాది పూర్తి.. ఏం జరిగింది? ఇంకా ఏమేం చూడాలి?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.