హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు కశ్మీర్లో భారీ ఎదురు దెబ్బ తగిలింది. షోపియాన్ ఎన్కౌంటర్లో హిజ్బుల్ ఆపరేషనల్ కమాండర్ యాసిన్ ఇటూ అలియాస్ ఘజనవీ హతమయ్యాడు. ఆదివారం జరిగిన కాల్పుల్లో యాసిన్తోపాటు అతడి అనుచరులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుర్హాన్ వనీ, జకీర్ ముసా ఉగ్ర వారసుడైన యాసిన్ను మట్టుబెట్టామని కశ్మీర్ రేంజ్ ఐజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ మరణించగా.. ముసా అతడి వారసుడిగా ఎదిగాడు. కానీ ఉగ్రవాద సంస్థ అతణ్ని బహిష్కరించడంతో సబ్జర్ భట్ హిజ్బుల్కు నాయకత్వం వహించాడు. ఇటీవల అతడు కూడా హతం కావడంతో.. యాసిన్ ఆపరేషనల్ కమాండర్గా బాధ్యతలు చేపట్టాడు.
శనివారం షోపియాన్ ప్రాంతంలోని అవ్నీరా గ్రామంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. రాత్రి వేళ ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. దీంతో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది.. మసీదు పక్కన ఉన్న ఇంట్లో దాగి ఉన్న యాసిన్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. బుడ్గాం జిల్లాలోని చడూరా ప్రాంతానికి చెందిన యాసిన్ 1997లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరంలో చేరి శిక్షణ పొందాడు.
ఎన్కౌంటర్లో మరణించిన మిగతా ఇద్దరు టెర్రరిస్టుల్ని ఉమెర్ మజీద్ మిర్, ఇర్ఫాన్ ఉల్ హక్గా గుర్తించారు. వీరిద్దరూ గతంలో భద్రతా దళాలపై పలుమార్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు గాయపడగా.. శ్రీనగర్లోని మిలిటరీ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మరణించారు.
శనివారం షోపియాన్ ప్రాంతంలోని అవ్నీరా గ్రామంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. రాత్రి వేళ ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. దీంతో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది.. మసీదు పక్కన ఉన్న ఇంట్లో దాగి ఉన్న యాసిన్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. బుడ్గాం జిల్లాలోని చడూరా ప్రాంతానికి చెందిన యాసిన్ 1997లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరంలో చేరి శిక్షణ పొందాడు.
ఎన్కౌంటర్లో మరణించిన మిగతా ఇద్దరు టెర్రరిస్టుల్ని ఉమెర్ మజీద్ మిర్, ఇర్ఫాన్ ఉల్ హక్గా గుర్తించారు. వీరిద్దరూ గతంలో భద్రతా దళాలపై పలుమార్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు గాయపడగా.. శ్రీనగర్లోని మిలిటరీ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మరణించారు.