యాప్నగరం

Bihar Exit Polls: నితీశ్, బీజేపీ కూటమికి భంగపాటు తప్పదా?

Bihar: బీహార్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కుతుందా? కాంగ్రెస్ చరిత్రను తిరగరాస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

Samayam Telugu 7 Nov 2020, 8:37 pm
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం దృష్టి సారించింది. శనివారం (నవంబర్ 7) మూడో దశ (తుది దశ) పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నాకివే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్‌‌తో పిండేసిన సీఎం నితీశ్ (Nitish Kumar)‌కు బిహార్ ఓటర్లు విజయం కట్టబెడతారా? NDA కూటమి మరోసారి అధికారం దక్కించుకుంటుందా? లేకపోతే.. కాంగ్రెస్, RJD కూటమి.. నితీశ్ విజయాలకు బ్రేకులు వేస్తుందా? తద్వారా ఢిల్లీ పీఠానికి బలమైన సంకేతం పంపుతుందా? 15 ఏళ్ల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తుది దశ పోలింగ్ పూర్తైన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. మరి ఏ సంస్థ ఏ కూటమికి ఎన్ని సీట్లు కట్టబెట్టింది? వివరాలు..
Samayam Telugu బిహార్ ఎగ్జిట్ పోల్స్
Bihar Assemly Elections 2020 Exit Polls


బిహార్‌లో అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టడానికి 122 (మ్యాజిక్ ఫిగర్) సీట్లలో గెలవాలి. అధికార జేడీయూ కూటమి మరోసారి బీజేపీతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

టైమ్స్ నౌ- సీ ఓటర్ (Times Now-CVoter) సర్వే:
టైమ్స్ నై సీ ఓటర్ సర్వే బిహార్‌లో హంగ్ ఏర్పడుతుందని తేల్చింది. మహా కూటమికే స్వల్ప ఆధిక్యం దక్కుతుందని తెలిపింది. మహా కూటమి (ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి) 120 స్థానాల్లో, ఎన్డీయే కూటమి 116 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.
NDA: 116
Grand Alliance: 120
LJP: 1
ఇతరులు: 6

జన్ కీ బాత్ (Jan Ki Baat) సర్వే:
జన్ కీ బాత్ సర్వే కూడా హంగ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది. మహా కూటమికే ఆధిక్యం దక్కుతుందని తెలిపింది. మహా కూటమి 118 నుంచి 138 స్థానాల్లో, ఎన్డీయే కూటమి 91 నుంచి 117 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు 5 నుంచి 8 స్థానాల్లో, ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది.
NDA: 91-117
Grand Alliance: 118 - 138
LJP: 5 - 8
ఇతరులు: 3 - 6

ఇండియా టుడే (India Today) సర్వే:
ఇండియా టుడే సర్వే కూడా మహా కూటమికే అధికారం దక్కుతుందని తెలిపింది. సీఎం పదవి చేపట్టడానికి తేజస్వీ యాదవ్‌కు 44 శాతం, నితీశ్ కుమార్‌కు 35 శాతం, చిరాగ్ పాశ్వాన్‌కు 7 శాతం అవకాశం ఉందని తెలిపింది. ఇండియా టుడే సర్వే ప్రకారం.. ఆయా పార్టీలు గెలిచే సీట్ల సంఖ్య ఇలా ఉంది..
Grand Alliance: 120+
NDA: 116+
LJP: 1
ఇతరులు: 0

పొత్తులో భాగంగా బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహా ఘట్‌బంధన్‌లో ఆర్జేడీ 140 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో వామపక్షాలు 29 (19 + 10) స్థానాల్లో పోటీ చేశాయి. దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ మొత్తం 134 సీట్లలో పోటీ చేసింది. ఈయన కూడా మోదీ బొమ్మతోనే ప్రచారం చేస్తూ నితీశ్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయడం గమనార్హం.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును నవంబర్ 10న చేపట్టనున్నారు. తుది ఫలితాల కోసం అప్పటివరకు వేచి చూడాల్సిందే.

Also Read: చివరి క్షణంలో సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన

Must Read: జో బైడెన్‌కు సెక్యూరిటీ పెంపు..

Also Read: Exit Polls: మధ్యప్రదేశ్ ‌ఉపఎన్నికలు.. ప్రభుత్వం మారుతుందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.