యాప్నగరం

Bihar CM ఇది ఇంగ్లాండ్ కాదు.. ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్న యువ రైతుపై నితీశ్ అసహనం

వ్యవసాయానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఓ యువ రైతుపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన తప్పల్లా తన ప్రసంగంలో ఎక్కువగా ఇంగ్లిష్ పదాలను వాడటమే. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అన్న పదానికి బదులుగా సర్కారీ యోజన అనలేరా? అని సీఎం నిలదీశారు. తాను కూడా బీటెక్ చదివానని, రోజువారీ పనులకు ఇంగ్లిష్ పనేంటని అన్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 Feb 2023, 2:25 pm

ప్రధానాంశాలు:

  • పట్నాలో వ్యవసాయ రోడ్ మ్యాప్ సదస్సు
  • ఆంగ్లంలో ప్రసంగించిన యువ రైతు
  • మధ్యలో జోక్యం చేసుకున్న నితీశ్ కుమార్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nitish Kumar
ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్త ఇంగ్లిష్ అతి వినియోగం బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్‌కు ఆగ్రహం తెప్పించింది. వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పట్నాలోని బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్’ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న లఖిసరాయ్‌కు చెందిన యువ రైతు అమిత్‌కుమార్.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను (Nitish Kumar) ప్రశంసిస్తూ ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ప్రారంభించారు. ఆంగ్లంలో ఆయన అన్యాపదేశంగా మాట్లాడుతుండగా నితీశ్ కుమార్ మధ్యలో కల్పించుకున్నారు.
ప్రసంగంలో అతిగా ఆంగ్ల పదాలు వినియోగించడం వల్లే కల్పించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ఇదేమీ ఇంగ్లండ్ కాదు కదా? అని ఆని ఆయన మండిపడ్డారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అన్న పదానికి బదులుగా సర్కారీ యోజన అనలేరా? అని ప్రశ్నించారు. తాను కూడా ఇంగ్లిష్‌లోనే ఇంజినీరింగ్ చదివానని, అది వేరే విషయమని వ్యాఖ్యానించారు. రోజువారీ కార్యకలాపాలకు ఇంగ్లిష్‌ను ఎందుకు ఉపయోగించాలని సీఎం అసహనం వ్యక్తం చేశారు.


కోవిడ్-19 లాక్‌డౌన్స్ కారణంగా స్మార్ట్ ఫోన్‌కు బానిసగా మారిన చాలా మంది తమ సొంత భాషలను కూడా మరిచిపోయారని నితీశ్ అన్నారు. దీంతో ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి అమిత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన అమిత్.. పుణేలోని ఓ సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. తన సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారుచ్చు.

కాగా, నితీశ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆంగ్ల భాషపైనే చిరాకు ఉందా? లేక తన ముందు ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని అసూయా? బహిరంగ ప్రసంగంలో ఆంగ్ల పదాలను ఉపయోగించడంపై అతని అభ్యంతరం పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది.. పగటి కలల కంటోన్న నితీశ్ జీ.. రాజకీయ ఉన్మాదిలా మారుతున్నారు’ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ విమర్శించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.