బిహార్ సీఎం నితీష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కిషన్ గంజ్ నుంచి పట్నాకు వెళ్తుండగా సౌపాల్ వద్ద కాన్వాయ్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
సీఎం కాన్వాయ్ లో ఉన్న ఆరుగురు పోలీసులు గాయాలపాలయ్యారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సీఎం కాన్వాయ్ లో ఉన్న ఆరుగురు పోలీసులు గాయాలపాలయ్యారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.