యాప్నగరం

అక్రమ సంబంధాలు.. కుమారుడిని హత్యచేసిన తల్లిదండ్రులు

ఇతర మహిళలతో శారీరక సంబంధాలున్నాయని భార్య అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్లినా మార్పు రాలేదు.

Samayam Telugu 6 Nov 2018, 3:54 pm
కుమారుడి వల్ల తమ పరువు పోతోందని, అతడి ఆగడాలు భరించలేని తల్లిదండ్రులు అతడ్ని కడతేర్చారు. ఈ దారుణం బిహార్‌లోని ఖగారియా జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Samayam Telugu Man Beaten to death


సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పీకే ఝా కథనం ప్రకారం.. గోర్గి సమీపంలోని మహేష్‌ఖుంత్ గ్రామానికి చెందిన అరవింద్ కుమార్ చౌరాసియా(28)కి కొన్నేళ్ల కిందట వివాహమైంది. అతడికి ఇతర మహిళలతో శారీరక సంబంధాలున్నాయని భార్య అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. అయినా తమ కుమారుడు వివాహేతర సంబంధాలు కొనసాగించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.

తప్పుడు పనులు చేయొద్దని పలుమార్లు చెప్పినా వినకుండా తల్లిదండ్రులతో అరవింద్ గొడవ పడేవాడు. ఈ క్రమలో సోమవారం రాత్రి కుమారుడి వివాహేతర సంబంధాలపై ఇంట్లో గొడవ జరిగింది. కుమారుడి ఆగడాలు భరించలేక అతడిపై దాడిచేసి హత్య చేశామని తల్లిదండ్రులు అంగీకరించారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖగారియా ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.