వచ్చే కోడళ్లు సినిమాలు, షికార్లు అంటూ తిరగకూడదు.. హోమ్లీ లుకింగ్ తో.. సంప్రదాయబద్ధంగా ఉండాలంటున్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ సతీమణీ, నితీష్ ప్రభుత్వంలో మంత్రులు తేజ్ ప్రతాప్, తేజస్వీ ప్రసాద్ ల తల్లి రబ్రీదేవీ.
ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్ జన్మిదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తనయులకు ఎలాంటి కోడళ్లు కావాలని పలువురు అడిగిన ప్రశ్నలకు రబ్రీదేవీ సూటిగా సమాధానం చెప్పారు. ‘సినిమాలు, సికార్లు, మాల్స్ అంటూ తిరగొద్దు. ఇల్లును జాగ్రత్తను చూసుకోవాలి. పెద్దవాళ్లను గౌరవించాలి. నాలాగా ఇతర పనులు కూడా చూసుకోవాలి’ అని చెప్పారు.
తనయుడు తేజ్ ప్రతాప్ భక్తిగలవాడని ఆయనకు మాత్రం సంప్రదాయ బద్ధమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నట్లు రబ్రీ పేర్కొన్నారు.
ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్ జన్మిదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తనయులకు ఎలాంటి కోడళ్లు కావాలని పలువురు అడిగిన ప్రశ్నలకు రబ్రీదేవీ సూటిగా సమాధానం చెప్పారు. ‘సినిమాలు, సికార్లు, మాల్స్ అంటూ తిరగొద్దు. ఇల్లును జాగ్రత్తను చూసుకోవాలి. పెద్దవాళ్లను గౌరవించాలి. నాలాగా ఇతర పనులు కూడా చూసుకోవాలి’ అని చెప్పారు.
తనయుడు తేజ్ ప్రతాప్ భక్తిగలవాడని ఆయనకు మాత్రం సంప్రదాయ బద్ధమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నట్లు రబ్రీ పేర్కొన్నారు.