యాప్నగరం

‘ఎగ్జిట్ పోల్స్ తప్పు చెప్పాయ్..మేం నమ్మం’

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టబోతుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని కోడై కూస్తుండటాన్ని

Samayam Telugu 10 Mar 2017, 12:54 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టబోతుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని కోడై కూస్తుండటాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఈ ఒపినీయన్ పోల్స్ అని తప్పని, యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కూటమి గెలిచి తీరుతుదని..అప్పుడు మాట్లాడతానని ఆయన అన్నారు.
Samayam Telugu bihar exit polls were wrong we will win in up rahul
‘ఎగ్జిట్ పోల్స్ తప్పు చెప్పాయ్..మేం నమ్మం’


‘‘2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఢంకాభజాయించాయి. కానీ వాటి లెక్కలు తప్పాయి. మహాకూటమి (జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్) బ్రహ్మండమైన మెజార్టీ సాధించి అధికారం దక్కించుకుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నిల్లో మేం గెలుస్తాం. మార్చి11 (ఫలితా రోజు)న మాట్లాడతాం’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే...యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఓటమి పాలవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో అఖిలేష్ స్వరం మార్చారు. హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే రాజకీయ విరోధి అయిన బీఎస్పీతో అయినా చేతులు కలిపి..బీజేపీని యూపీలో అడుగుపెట్టకుండా చేస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.