యాప్నగరం

బిహార్‌లో సెప్టెంబర్ 6 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Patna: కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ సెప్టెంబర్ 6 వరకు పొడగించారు.

Samayam Telugu 17 Aug 2020, 5:55 pm
హించినట్టే బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 6 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. బిహార్‌లో కరోనా స్థితిగతులు, లాక్‌డౌన్ అంశాలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ నేతృత్వంలో సోమవారం (ఆగస్టు 17) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కరోనా కట్టడి దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Samayam Telugu బిహార్ లాక్‌డౌన్
Lockdown Extended in Bihar


ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తాయని తాజా ఉత్తర్వుల్లో బిహార్ ప్రభుత్వం పేర్కొంది. రైలు, విమాన సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మతపరమైన ప్రదేశాలు, బస్సు సర్వీసులు, పార్క్‌లు, జిమ్ములు మూసే ఉంటాయని తెలిపింది.

బిహార్‌లో విధించిన లాక్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,03,283కి చేరింది. ఆదివారం కొత్తగా 3,814 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read: అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి కరోనా రోగి పరారీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.