యాప్నగరం

మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి: మంత్రి

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బిహార్ కు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ చిత్ర పటాలను చెప్పులతో కొట్టాలని ఆయన

Samayam Telugu 1 Mar 2017, 2:08 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బిహార్ కు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ చిత్ర పటాలను చెప్పులతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు..ప్రధాని ఓ బంధిపోటు అంటూ ఘాటుగా విమర్శించారు.
Samayam Telugu bihar minister asks his supports to beat the picture of modi with slippers
మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి: మంత్రి


ఫిబ్రవరి 22న బిహార్ లోని అమౌర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నోట్లరద్దును నిరసిస్తూ నిర్వహించిన జన్ వేదన ర్యాలీలో ఆ రాష్ట్ర మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని తక్షణం కేబినేట్ నుంచి తొలగించాలని బిహార్ రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మస్తాన్ పై కేసు పెట్టి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మస్తాన్ చేసిన వ్యాఖ్యలను సీఎం నితీష్ కుమార్ ఖండించారు.

మోదీ ఫొటోను చెప్పులతో కొట్టాలని సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశిస్తూ చెప్పగానే...కొంతమంది..మోదీ ఫొటోను స్టేజీపై ఏర్పాటు చేసి..చెప్పులతో కొట్టడం మొదలుపెట్టారు.

నితీష్ ప్రభుత్వంలో కాంగ్రెస్, ఆర్జేడీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.