యాప్నగరం

అంత్యక్రియలకు వచ్చినంత మాత్రాన ఆ జవాన్ లేచొస్తాడా: బీహార్ మంత్రి

ఉగ్రవాదుల దాడిలో అమరుడైన జవాన్ గురించి ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంత్యక్రియలకు హాజరైనంత మాత్రాన చచ్చినవాడు బతుకుతాడా అంటూ బీహార్ మంత్రి వినోద్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

TNN 15 Feb 2018, 8:34 pm
ఉగ్రవాదుల దాడిలో అమరుడైన జవాన్ గురించి ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంత్యక్రియలకు హాజరైనంత మాత్రాన చచ్చినవాడు బతుకుతాడా అంటూ బీహార్ మంత్రి వినోద్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని కరణ్ నగర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను ముజాహిద్ ఖాన్ అమరుడయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 14) ఆ అమర జవాన్ అంత్యక్రియలను బీహార్‌లోని అతడి స్వగ్రామంలో నిర్వహించారు. దీనికి జనం పెద్ద సంఖ్యలో హాజరై ముజాహిద్‌కు నివాళులు అర్పించగా.. ప్రభుత్వం తరఫున ఒక్క మంత్రి కూడా హాజరుకాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Samayam Telugu bihar minister vinod singhs shocking comments on martyr crpf jawan
అంత్యక్రియలకు వచ్చినంత మాత్రాన ఆ జవాన్ లేచొస్తాడా: బీహార్ మంత్రి


తాజాగా ఈ అంశంపై మీడియా వేసిన ప్రశ్నకు మంత్రి వినోద్ సింగ్ స్పందించారు. ‘అంత్యక్రియలకు వచ్చినంత మాత్రాన చనిపోయిన వ్యక్తి తిరిగి లేచొస్తాడా.. నిన్ననే వచ్చి ఉంటే ఏం ఒరిగేది? అయినా.. నేను ఇప్పటికే ఆ జవానుకు మనస్ఫూర్తిగా నా మనసులోనే సెల్యూట్ చేశాను’ అని వినోద్ అన్నారు.

ఈ అంశం పెద్ద వివాదం అయింది కదా అని మీడియా మరో ప్రశ్న వేయగా.. ‘కతిహార్ నుంచి పిరోకు ఎంత దూరం ఉంటుందో మీకు తెలియదా? 400 కి.మీ. ప్రయాణించి నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడే ఆ అమరవీరుడి కుటుంబాన్ని కలవబోతున్నా. ఆ తర్వాత అంత దూరం నేను తిరిగెవెళ్లాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ముజాహిద్ సోమవారం మరణించాడు. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షల చెక్కును తీసుకోవడానికి కూడా ఆ జవాను కుటుంబం నిరాకరించింది. సాధారణంగా ఇలాంటి కుటుంబాలకు రూ. 11 లక్షలు అందిస్తుండగా.. బీహార్ ప్రభుత్వం అందులో సగం కూడా ఇవ్వకపోవడం ఆగ్రహం తెప్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.