యాప్నగరం

Nawada SP: పనితీరు బాగోలేదని.. పోలీసులను లాకప్‌లో ఉంచిన జిల్లా ఎస్పీ.. వీడియో వైరల్

Nawada SP: పనితీరు నచ్చకపోతే ఉన్నతాధికారులు మందలించడం కామన్. కానీ బిహార్‌లోని నవాదాకు చెందిన ఎస్పీ మాత్రం ఐదుగురు పోలీసులను రెండు గంటలపాటు లాకప్‌లో పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకూ వెళ్లడంతో.. కింది స్థాయి సిబ్బందితో మంచిగా మెలగాలని ఉన్నతాధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు. క్రమశిక్షణ పేరిట ఇష్టారీతిన వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 11 Sep 2022, 12:03 pm

ప్రధానాంశాలు:

  • పోలీసులను లాకప్‌లో పడేసిన ఎస్పీ
  • రెండు గంటలపాటు లాకప్‌లో ముగ్గురు ఏఎస్సైలు, ఇద్దరు ఎస్సైలు
  • బిహార్‌లోని నవాదాలో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Police In Lockup
Police In Lockup
పనితీరు బాగోలేకపోతే ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని మందలించడం సాధారణమే. కానీ బిహార్‌లోని నవాదా జిల్లా ఎస్పీ మాత్రం పనితీరు బాగోలేదనే కారణంతో ఐదుగురు పోలీసులకు విచిత్రమైన శిక్ష విధించారు. ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను గురువారం రాత్రి రెండు గంటలపాటు లాకప్‌ లోపల ఉంచారు. లాకప్‌లో ఐదుగురు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ విషయమై మీడియా ఎస్పీని ప్రశ్నించగా.. అది తప్పుడు వార్త అని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ వివాదంపై వారు స్పందించలేదు. కాగా ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని బిహార్ పోలీస్ సంఘం డిమాండ్ చేసింది. పోలీసులను లాకప్‌లో వేసిన ఘటన గురించి ఆరా తీయడానికి ప్రయత్నించగా.. ఎస్పీ అందుబాటులో లేరని బిహార్ పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ మృత్యుంతజయ కుమార్ సింగ్ తెలిపారు.

‘అధికారులను ఎస్పీ లాకప్‌లో వేసిన విషయమై బిహార్ పోలీసుల్లో తీవ్రంగా చర్చ నడించింది. ఇలాంటి ఘటనలను ఇంతకు ముందెప్పుడూ తాము చూడలేదు.. ఇలాంటి ఘటనలు బిహార్ పోలీసు విభాగం ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ఘటనపై న్యాయ విచారణ డిమాండ్ చేస్తున్నాం. అసలేం జరిగిందో సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరపాలి’ అని మృత్యుంతజయ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు.
ఈ విషయంలో నోరు మెదపొద్దని లాకప్‌లో ఉన్న పోలీసు అధికారులపై ఎస్పీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని చెరిపేసే ప్రయత్నాలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది. దీంతో బిమార్ చీఫ్ సెక్రటరీ అమిత్ సుభానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులతో మంచిగా మసులుకోవాలని ఆదేశిస్తూ.. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఏ కారణం లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడొద్దని.. ఉద్యోగులను హింసిస్తే సహించబోమని చీఫ్ సెక్రటరీ హెచ్చరించారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.