యాప్నగరం

కట్నం అడుగుతావా..? తుపాకీ గురిపెట్టి పెళ్లి

అమ్మాయిని ప్రేమించాడు.. తీరా పెళ్లి చేసుకునే సమయానికి భారీ మొత్తంలో కట్నం డిమాండ్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన యువతి

Samayam Telugu 18 Jul 2018, 8:31 am
అమ్మాయిని ప్రేమించాడు.. తీరా పెళ్లి చేసుకునే సమయానికి భారీ మొత్తంలో కట్నం డిమాండ్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన యువతి కుటుంబ సభ్యులు తుపాకీ గురి పెట్టి వివాహం జరిపించిన ఘటన బీహార్‌లోని సమష్టిపూర్‌లో చోటు చేసుకుంది. అయితే.. యువకుడి తల్లి తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారని జంధహా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu Bihar_Pakadua_Vivah_Railway_Engineer_Gunpoint_Marriage_0.


పోలీసుల కథనం ప్రకారం.. సమష్టిపూర్‌లోని రైల్వే డివిజన్‌లో శరణ్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను గత శనివారం స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెలుపలికి రాగా.. యువతి బంధువులు కిడ్నాప్ చేసి రాఘపూర్‌‌కి తీసుకెళ్లారు. అక్కడ శరణ్ తలకి తుపాకీ గురిపెట్టి 23 ఏళ్ల ప్రియాంక కుమారితో వివాహం జరిపించారు. అయితే శరణ్ తల్లి ఫిర్యాదు మేరకు అతడ్ని వధువు కుటుంబ సభ్యుల చెర నుంచి విడిపించి.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు యువతి కుటుంబ సభ్యులు తమకి ఏడాదన్నర కాలంగా శరణ్ తెలుసని చెప్తున్నారు. ప్రియాంక కుమారిని ప్రేమించానని.. వివాహం చేసుకుంటానని చెప్పిన శరణ్ ఇప్పుడు పెద్ద మొత్తంలో కట్నం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తాము అంత ఇవ్వలేమని చెప్పడంతో.. ఇప్పుడూ పూర్తిగా యువతితో మాట్లాడటం మానేశాడని.. అందుకే.. ఇలా తుపాకీ గురిపెట్టి బలవంతంగా పెళ్లి చేయాల్సి వచ్చిందని వారు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.