యాప్నగరం

బీహార్‌లో మళ్లీ లాక్‌డౌన్.. 75 మంది బీజేపీ నేతలకు కరోనా పాజిటివ్

Bihar: బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందతి. రాష్ట్రంలో మరోసారి 15 రోజుల పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించింది.

Samayam Telugu 14 Jul 2020, 4:19 pm
రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించింది. గురువారం (జులై 16) నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని బీహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం (జులై 14) ఉదయం రాష్ట్రంలో కరోనా కేసులు, వైరస్ వ్యాప్తి తదితర స్థితిగతులపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Samayam Telugu బీహార్ లాక్‌డౌన్
Bihar Lockdown


బీహార్‌లో బీజేపీకి చెందిన 75 నేతలు కరోనా వైరస్ బారినపడ్డారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీహార్ బీజేపీ నేతలంతా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో చాలా మందికి వైరస్ సోకింది. మొత్తం 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైరస్ బారిన పడిన వారిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేశ్ కుమార్, ఎమ్మెల్సీ రాధామోహన్ శర్మ తదితరులు ఉన్నారు.

మరోవైపు.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శైలేశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. సోమవారం వచ్చిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నితీశ్ కుమార్ కేబినెట్‌లో కరోనా వైరస్ బారినపడ్డ రెండో మంత్రి శైలేశ్ కావడం గమనార్హం. ఇంతకుముందు వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ కరోనా బారిన పడ్డారు.

Also Read: తల్లికి నెగటివ్.. పుట్టిన బిడ్డకు పాజిటివ్!

Must Read: ఉరికి వేలాడుతూ బీజేపీ ఎమ్మెల్యే.. హత్యా? ఆత్మహత్యా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.