యాప్నగరం

బెంగళూరులో కాల్పుల కలకలం

బెంగళూరులో మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం మధ్యాహ్నం నగర శివారులోని కొలిగు క్రాస్ రోడ్

Samayam Telugu 3 Feb 2017, 2:44 pm
బెంగళూరులో మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం మధ్యాహ్నం నగర శివారులోని కొలిగు క్రాస్ రోడ్ (బళ్లారి రహదారి-కొంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కదబగెరేపై కాల్పులు జరిపారు.
Samayam Telugu bike borne assailants shoot at bengaluru politician
బెంగళూరులో కాల్పుల కలకలం


శ్రీనివాస్ తన కారులో ప్రయాణిస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరపగా అందులో రెండు బుల్లెట్లు శ్రీనివాస్ కు తగిలాయి. ప్రస్తుతం శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాల్పులు జరిపి పారిపోయిన దుండగులను పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులు ప్రత్యేక టీంలున ఏర్పాటు చేశారు.

ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస్ పై పలు కేసులు ఉన్నాయి. ఆయన సోదరుడిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.