యాప్నగరం

బస్సును ఢీకొట్టిన బైక్.. యువకుడు సజీవదహనం

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టగానే చెలరేగిన మంటలు.. నడిరోడ్డుపై బైక్‌తో సహా సజీవదహనమైన యువకుడు.

Samayam Telugu 26 Dec 2018, 1:37 pm

ప్రధానాంశాలు:

  • నడిరోడ్డుపై సజీవదహనమైన యువకుడు
  • అతివేగమే ప్రాణం తీసిందంటున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bng.
కర్ణాటకలో అతివేగం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బైక్ బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి.. నడిరోడ్డుపై యువకుడు సజీవదహనమయ్యాడు. బుధవారం ఉదయం నీరజ్ అనే యువకుడు బైక్‌పై.. కోలార్ జిల్లా బంగారుపేట రోడ్డుపై వెళుతున్నాడు. బైక్ మంచి స్పీడుతో వెళ్లి.. రోడ్డుపై వెళుతున్న ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టింది. సెకన్ల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి.
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో.. యువకుడు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. నీరజ్ వెంటనే రోడ్డుపై పడిపోయాడు. మంటలు అతడ్ని చుట్టుముట్టడంతో కాలిపోయాడు. నిముషాల వ్యవధిలోనే అక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు ప్రమాదాన్ని గమనించి.. అతడ్ని కాపాడే ప్రయత్నం చేసేలోపే ఘోరం జరిగిపోయింది. పాపం కళ్లముందే యువకుడి ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని స్థితిలో స్థానికులు ఉండిపోయారు.

ఘటన జరిగిన తీరును చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని.. పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడికి సంబంధించిన వివారాలపై ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.