యాప్నగరం

అమ్మాయిపై ఉమ్మేసిన పోకిరి... కరోనా భయంలో యువతి

ముంబై మిలటరీ క్యాంపు సమీపంలో ఘటన. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతి. బైక్ పై వచ్చి ఉమ్మి వేసిన పోకిరి. పోలీసులకు యువతి ఫిర్యాదు. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.

Samayam Telugu 7 Apr 2020, 1:46 pm
కరోనా విజృంభిస్తున్న కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలపై వెకిలి చేష్టలకు దిగుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మణిపూర్‌కు చెందిన ఓ అమ్మాయిపై ఓ యువకుడు ఉమ్మేసి పారిపోవడం కలకలం రేపుతోంది. ముంబైలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయిపై యువకుడు ఉమ్మి వేస్తూ పరారయ్యాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో యువతి షాక్‌కు గురైంది. వోకాలా పోలీసు స్టేషన్‌ పరిధిలోని కలినా మిలిటరీ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu spit


స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు యువతి తన స్నేహితురాలితో కలిసి నిత్యావసర వస్తువులు కొనేందుకు బయటకు వచ్చింది. అదే సమయంలో గుర్తు తెలియని యువకుడు అటుగా బైక్‌పై వచ్చాడు. అతడి ముఖానికి ఉన్న మాస్క్ తీసి యువతిపై ఉమ్మేశాడు. గుట్కా తింటున్న సదరు యవకుడు యువతి బట్టలపై ఉమ్మేశాడు. వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో ఎక్కడ తనకు కరోనా సోకుతుందేమోనని ఆ యువతి భయపడుతోంది. . కరోనా సోకిన వారు ఉమ్మివేస్తే అది తమకూ సోకుతుందని ప్రజలు భయపడుతున్న వేళ పోకిరీలు చేసిన ఇటువంటి చేష్టలకు అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమ్మాయిపై ఉమ్మి వేసిన ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం స్పందించింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇటీవల ఢిల్లీలో మణిపూర్‌ మహిళపై ఉమ్మేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇది జాతి వివక్షగానూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య భారత మహిళలపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుడడం ఆందోళన కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.