యాప్నగరం

తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్‌గా జెపీ నడ్డా.. మరో రెండు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లు

ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసిన బీజేపీ.. మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లు.. తెలంగాణ ఇంఛార్జ్‌గా కేంద్రమంత్రి జేపీ నడ్డా..

Samayam Telugu 3 Oct 2018, 9:25 pm
త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. తెలంగాణతో పాటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమళదళం. పార్టీ బలోపేతంతో పాటూ.. ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసేందుకు మూడు రాష్ట్రాలకు కేంద్రమంత్రుల్ని ఇంఛార్జ్‌లుగా నియమించింది. తెలంగాణకు జేపీ నడ్డా.. రాజస్థాన్‌కు ప్రకాశ్ జవదేకర్.. మధ్యప్రదేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌లను నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు.
Samayam Telugu nadda.


ఎన్నికల ఇంఛార్జ్‌లు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు, ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. పరిస్థితులను బట్టి పొత్తుల అంశంపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. త్వరలోనే ముగ్గురు ఇంఛార్జ్‌లు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.