యాప్నగరం

పార్టీ గెలిచినా.. సీఎం కల చెదిరింది!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా సాగుతున్నా.. సీఎం అభ్యర్థి పీకే ధుమాల్‌కు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.

TNN 24 Feb 2021, 1:47 pm
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా సాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే. హిమాచల్ ప్రదేశ్‌లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ అధికారంలోకి రానుంది. కానీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలయ్యారు. రెండుసార్లు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పని చేసిన ఆయన్ను బీజేపీ సీఎం అభ్యర్థిగా అమిత్ షా ప్రకటించారు. కానీ సుజాన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు.
Samayam Telugu bjp cm candidate prem kumar dhumal losses in himachal pradesh assembly polls
పార్టీ గెలిచినా.. సీఎం కల చెదిరింది!


పీకే ధుమాల్ ఓడిపోవడంతో.. మరో సీనియర్ నేత జేపీ నడ్డాను సీఎంగా ఎంపిక చేసే దిశగా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా.. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.