యాప్నగరం

అనూహ్యం.. బీజేపీ ఘన విజయం దిశగా!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం దిశగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్‌లో బాగా వెనుకబడినట్టుగా కనిపించిన

Samayam Telugu 15 May 2018, 11:24 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం దిశగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్‌లో బాగా వెనుకబడినట్టుగా కనిపించిన భారతీయ పార్టీ క్రమక్రమంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలో లీడ్ సాధించిన సమయంలో కేవలం రెండు సీట్ల లీడ్‌కు పరిమితమైన బీజేపీ ఆ తర్వాత అదరగొట్టేసింది. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా చేస్తూ ముందుకు సాగింది. హంగ్ తప్పదేమో అనే పరిస్థితుల నడుమ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే దిశగా ముందుకు సాగింది భారతీయ జనతా పార్టీ. ఆ ముచ్చట పూర్తి అయ్యాకా.. మినిమం మెజారిటీ దిశగా సాగింది కమలం పార్టీ. 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుని ఘన విజయం దిశగా పయనిస్తోంది.
Samayam Telugu bjp2


ఇప్పటి వరకూ ఉన్న ఫలితాల సరళిని బట్టి చూస్తే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమే. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన బలాన్ని సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీకి తోడు ఒకరిద్దరుగా ఉన్న స్వతంత్రులు కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే అని అనుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ ఊహించని పరాజయంతో కుదేలయ్యింది. అరవై చిలర్ల సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మిగిలితే మిగలవచ్చు. అయితే తమ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగలవచ్చు అని అనుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం ఇవి మింగుడుపడని ఫలితాలే. హంగ్ తరహా పరిస్థితులు వస్తాయి, జేడీఎస్ మద్దతుతో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావొచ్చు అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆశించారు. అయితే వీళ్లకు ఆ ఛాన్సే లేకుండా పోతోంది. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ చిన్నబోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.