యాప్నగరం

బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌కు గుండెపోటు

బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు వైద్యం అందిస్తున్నారు.

Samayam Telugu 6 Aug 2019, 11:18 pm
విదేశాంగ శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆరోగ్యం విషమించింది. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu sushma


సుష్మా స్వరాజ్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్.. ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంత మంది నేతలు ఆమెకు సంతాపం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.