రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాలేరని నేషనలిస్ట్ కాంగ్రెస్ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లను బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి మోదీ ప్రధాని పదవిని చేపట్టం సాధ్యం కాదని అన్నారు. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని, మోదీని ప్రధానిగా చూసేందుకు అవి సిద్ధంగా లేవని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిపై మార్చి 14, 15 తేదీల్లో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నుంచి చిన్న పార్టీలు తప్పుకోవడంపై స్పందించిన ఆయన, కొన్ని పోతే, మరికొన్ని వచ్చి కలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి హామీ లభిస్తే, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ వంటి పార్టీలు కలుస్తాయని అన్నారు.
మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 45 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవార్, ఆయన తప్పుగా మాట్లాడారని మొత్తం సీట్లు వారే గెలుధిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శరద్ పవార్ ప్రకటించిన మర్నాడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి 2012 నుంచే పవార్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు గత నెలలో పవార్ ప్రకటించి ప్రకంపనలు రేపారు. అంతేకాదు, ఆయన ఎన్నికల్లో పోటీచేస్తే తన సీటును వదులకుంటానని నైరుతి మహారాష్ట్రలోని మాధా ఎంపీ విజయ్సిన్హ్ మోహతే పాటిల్ ఆఫర్ ఇచ్చారు. కానీ, కుటుంబ ఒత్తిళ్లతో తన మనసు మార్చుకున్నానని, ఎన్నికల్లో పోటీచేయబోనని పవర్ మళ్లీ మాట మార్చారు. ఇక, ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగునుంది. ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నుంచి చిన్న పార్టీలు తప్పుకోవడంపై స్పందించిన ఆయన, కొన్ని పోతే, మరికొన్ని వచ్చి కలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి హామీ లభిస్తే, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ వంటి పార్టీలు కలుస్తాయని అన్నారు.
మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 45 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవార్, ఆయన తప్పుగా మాట్లాడారని మొత్తం సీట్లు వారే గెలుధిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శరద్ పవార్ ప్రకటించిన మర్నాడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి 2012 నుంచే పవార్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు గత నెలలో పవార్ ప్రకటించి ప్రకంపనలు రేపారు. అంతేకాదు, ఆయన ఎన్నికల్లో పోటీచేస్తే తన సీటును వదులకుంటానని నైరుతి మహారాష్ట్రలోని మాధా ఎంపీ విజయ్సిన్హ్ మోహతే పాటిల్ ఆఫర్ ఇచ్చారు. కానీ, కుటుంబ ఒత్తిళ్లతో తన మనసు మార్చుకున్నానని, ఎన్నికల్లో పోటీచేయబోనని పవర్ మళ్లీ మాట మార్చారు. ఇక, ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగునుంది. ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.