యాప్నగరం

​ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు.. మంత్రి పదవులిస్తాం..!

బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కనీసం సహజంగానే ముస్లింలు ఉండరు.

TNN 13 Mar 2017, 5:43 pm
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంగ్రామం జరుగుతున్న వేళ కొంతమంది భాజపా నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 403 స్థానాలు కలిగిన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. కనీసం ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం ఏమిటి? అంటూ కొంతమంది కేంద్రమంత్రులు కూడా గొణిగినట్టుగా వార్తలు వచ్చాయి. రాజ్ నాథ్ సింగ్, ఉమా భారతి వంటి వారు కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వాల్సింది.. అనే మాటను మాట్లాడారు. మరి అలాంటి వ్యూహాన్ని అనుసరించి కూడా బీజేపీ యూపీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
Samayam Telugu bjp offers minister posts for muslim leaders
​ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు.. మంత్రి పదవులిస్తాం..!


అయితే.. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కనీసం సహజంగానే ముస్లింలు ఉండరు. ముస్లిం మతానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ తరపున లేకపోవడంతో.. ఆ మతానికి చెందిన వారెవరికీ మంత్రి పదవులు దక్కే అవకాశం సహజంగానే ఉండదు. మరి యూపీ జనాభాలో భారీ ఎత్తున ఉన్న వారికి ప్రాతినిధ్యం లేకుండా పోతుందని సహజంగానే ఆందోళనలు వ్యక్తం అవుతాయి.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచే ఈ విషయంలో ఆసక్తికరమైన ప్రతిపాదన వస్తోంది. ఎమ్మెల్యే పదవుల్లో ముస్లింలు ఎవరూ లేకపోయినా.. మంత్రి వర్గంలోకి మాత్రం కొంతమందిని తీసుకుంటాం.. అని బీజేపీ ప్రకటించింది. ‘ఎమ్మెల్యేల్లో ముస్లింలు ఎవరూ లేకపోతేనేం.. ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వొచ్చు కదా.. ఆ విధంగా కొంతమంది ముస్లిం లను కేబినెట్ లోకి తీసుకుంటాం.. ’ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ముస్లిం మహిళలు, యువత భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచారని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని కమలనాథులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.